బంగారు గొడ్డలి

09/02/2010

రామయ్య నిజాయితీ కల వాడు, కాని పాపం, పేద వాడు. పగలంతా కట్టెలు కొట్టి , సాయంకాలం బజారుకెళ్ళి వాటిని అమ్మిన డబ్బులుతొ జీవనం సాగించేవాడు. అలా ఒక రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి నది వొడ్డున ఎండు చెట్టు నరుకుతుండగా చెయ్యి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. నదిలో దిగి ఎంత వెతికినా కనపడలేదు. ఎంతో విచారంతో , నది వొడ్డున విచారంతో తల పట్టుకొని కూర్చుండి పోయాడు. పాపం ఇంకో గొడ్డలి కొనడానికి డాబ్బులు కూడా లేవు. గొడ్డలి లేకపోతే ఇంటిల్లి పాది పస్తులుండాలి. అతని పరిస్థితిని చూసిన వనదేవత బాలుని రూపంలో ప్రత్యక్షమై – ” అన్నా! నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ” అని అడిగాడు.
రామయ్య అతనికి నమస్కారం చేసి ఇలా అన్నాడు – ” నా గొడ్డలి నీళ్ళాలో పడిపోయింది. మరి కట్టెలు ఎలా కొట్టేది? నా భార్యా పిల్లను ఎలా పోషించేది?” “నీవు బాధ పడద్దు. నేను నీ గొడ్డలి తెస్తాను ” అని వన దేవత అన్నాడు. దేవత నీటిలో మునిగి , ఓ బంగారు గొడ్డలి తెచ్చి – “ఇదిగో , నీ గొడ్డలి తీసుకో ” – అన్నాడు. రామయ్య అది చూసి “ఇది బంగారు గొడ్డలి. ఇది నాది కాదు” అన్నాడు.దేవత రెండో సారి మునిగి వెండి గొడ్డలి త్చ్చి ఇవ్వబోయాడు. రామయ్య – ” స్వామి! నా అదృష్టం బాగా లేదు. మీరు ఎంత వెతికినా నా గొడ్డలి చిక్కడం లేదు.నాది మామూలు ఇనుప గొడ్డలి ” అని చెప్పాడు. దేవత మూడోసారి మునిగి, ఇనుప గొడ్డలి తెచ్చాడు. రామయ్య సంతోషించి, తన గొడ్డలి తీసుకొని కృతజ్ఞతలు చెప్పాడు. వనదేవత రామయ్య నిజాయితీని మెచ్చుకొని  బంగారు,వెండి గొడ్డళ్ళు కూడా ఇచ్చాడు.
రామయ్య అవి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళకు ధనవంతుడయ్యాడు. కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళడం మానేసాడు.పొరుగింటి పుల్ల్లయ్య ఓ రోజు ” నీవెందుకు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడం మానేసావు ?” అని రామయ్యను అడిగాడు. జరిగిన కథంతా చెప్పాడు రామయ్య. పుల్లయ్య వొట్టి దురాశాపరుడు. బంగారం, వెండి మీద ఆశతో కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూ గొడ్డలి జార విడిచి, చెత్తుకింద కూర్చొని ఏడవసాగాడు. వనదేవత పుల్లయ్య దురాశ తగిన పాఠం చెప్పాలని ప్రత్యక్షమయ్యాడు. పుల్లయ్యను అడిగి, నీళ్ళలో మునిగి బంగారు గొడ్డలి పైకి తీసి చూపించాడు. పుల్లయ్య ఆనందంతో ఎగిరి గంతేశాడు – “ఇది నా గొడ్డలి!” అని కేకవేశాడు. “నీవు అబ్ద్దం చెప్తున్నావు .ఇది నీది కాదు” అని దాన్ని నీళ్ళలో వేసి, వనదేవత మాయమయ్యాడు.  అత్యాశకు పోయిన పుల్లయ్య ఇనుప గొడ్డలి కూడా పొగొట్టుకొని లబొదిబోమంటూ ఇంటికి బయలుదేరాడు.       

తాబేలు – కుందేలు

08/02/2010

ఓ అడవిలో కుందేలు ఒకటి ఉండేది. సాధారణంగా కుందేళ్ళు చిన్నవిగా ఉన్నా వేగంగా పరిగెత్తతాయి. ఆ కుందేలు తన కన్నా వేగంగా ఎవరూ పరిగెత్తలేరని విర్రవీగుతూ ఉంది. అక్కడ పక్కనే  ఆ మాటలు విన్న తాబేలు – ” అన్నా! నీవు చాలా వేగంగా పరిగెత్తగలవు. కాని అంత గర్వం పనికి రాదు, అలాఅయితే ఎప్పుడొ ఒకసారి అవమాన పడక తప్పదు” అంది. దానికి బదులుగా కుందేలు – ” నీకు ఉన్న మాట అంటే ఉలుకెందుకు? నీవు పురుగులాగా చిన్నగా పాకుతూ ఉంటావు. నన్ను చూసి నీకు కడుపు మంట.” అంతే కాక అలా ప్రతిసారి తాబేలును కుందేలు అవమానించ సాగింది. అవి భరించలేక ఒకసారి తాబేలు – ” ఊరికే గొప్పలు చెప్పుకోవటం కాదు.నాతో పందెం కాయి. ఎవరు గెలుద్దారో చుద్దాం ! ” అన్నది. కుందేలు దూరంగా ఉన్న ఒక చెట్టుని చూపించి తాబేలుతో ఇలా చెప్పింది – “అలాగే కానివ్వు. ఆచెట్టు వద్దకు ఎవరు ముందుగా వెళ్తారో , వాళ్ళే పందెం గెలిచినట్లు. సరేనా?”

పాపం! తాబేలు నిదానంగా దేకుతుంది. అది చెట్టుకు కాసింత దూరంలో ఉండ గానే, మొదలు పెట్టినానేను నాలుగు గెంతులు గెంతితే చాలు, దాన్ని దాటి పోగలను” అని  భావించింది కుందేలు. అందుకని ధీమాగా తాబేలుతో ఇలా అంది. “నీవు వొట్టి సోమరివి. మెల్ల మెల్లగా నడిస్తావు. నివు నడువు. నేను కాసేపాగి వస్తాను.”  “పరుగుపందెం ఈ క్షణమే మొదలైనట్లు తెలిసిందా? నీ ఇష్టం వచ్చినప్పుడు రా నాకేం?” తాబేలు చెప్పింది. ఆ మాటలకు కుందేలు తల ఊపింది. “ఇది చెట్టు వరకు వెళ్ళడం అంటే తెల్లారినట్లే. అందాకా ఓ చిన్న కునుకు తీస్తా” అనుకొంది కుందేలు. అది అక్కడే పడుకొని కునుకు తిసింది. మెలుకువ వచ్చేసరికి ఎంత సేపు నిద్ర పోయిందో తెలిసింది కాదు. వెంటనే గబగబా గెంతు కుంటూ చెట్టువద్దకు వెళ్ళింది. కాని తన కంటే తాబేలు ఉండటం చూసి సిగ్గుతో తల దించుకొంది. అంత గర్వం పనికి రాదని తెలుసుకొంది.

కష్టానికి ఫలం

05/02/2010

రామయ్య అనే రైతు బాగా ఆస్ఠి ఉన్న రైతే కాని పెద్ద సోమరి.పొలం పనులు చూసుకోకుండా, పశువుల గురించి పట్టించుకోకుండా ఉండేవాడు.ఏ వస్తువులు ఇంట్లో ఉన్నాయో , ఏవి ఇంట్లో పొయ్యాయో పట్టించుకొనే వాడు కాదు. దానితో ఇంటి పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది.పంటలలో నష్టాలు రాసాగింది.పాడివల్ల కూడా పెద్దగా లాభం లేకుండా పొయింది. ఓ రోజు తన మిత్రుడు హరిశ్చంద్రుడు అతనికి ఇంటికి వచ్చాడు. అతను రామయ్య ఇంటి పరిస్థిని గమనించి, చెబితే వినే స్వభావాడు కాదు అని గ్రహించాడు. ఎలాగైనా తనకు మేలు చేయాలని ఆల్చించి రామయ్య ఇలా అన్నాడు – “నీ కష్టాలు చూస్తుంటే నాగుండె తరుక్కుపోతుంది. నీ దరిద్రం పోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది.”.”బాబ్బాబూ! ఆ ఉపాయం కాస్తా చెప్పి, పుణ్యం కట్టుకో కూడదూ” నీవు చెప్పినట్లే కచ్చితం పాటిస్తాను.” – రామయ్య అంటాడు.

హరిశ్చంద్రుడు – “పక్షులు లేవకముందే మనస సరోవరంలో ఉండే ఓ హంస ఈ భూమిమీదకి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వాలుతుందో ఎవరికీ ఎవరికీ తెలియదు. కాని ఆ హంసను దర్శనం చేసుకొనే వాళ్ళకు ఎలాంటి లోతూ ఉండదు”. రామయ్య – “ఏమైనా సరే , నేను ఆ హంసను తప్పక చూడాలి.” హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు. రామయ్య మరుసటిరోజు కోడి కూయక ముందే లేచాడు. ఇల్లు దాటి, హసను వెతుక్కుంటూ పొలంవైపు వెళ్ళాడు.అక్కడ పక్కపొలం యజమాని రామయ్య ధాన్యం కుప్పనుంచి ధాన్యాన్ని తన కుప్పలోకి ఎత్తిపోసుకోవడం చూశాడు. రామయ్యను చూడగానే అతను సిగ్గుతో తలవంచుకొని, క్షమించమని ప్రార్థించాడు.పొలమ్నుంచి అతను ఇంటికి తిర్గొచ్చాడు.పశువుల పాక వైపు వెళ్తుండగా పశువుల కాపరి పాలు పిండి, తన భార్య తెచ్చిన పాత్రలోకి వంచుతుండం చూశాడు.అతన్ని మందలించి ఫలహారం తిని మాళ్ళి హంసను వెతుక్కుంటూ పొలం వైపు బయలుదేరాడు.పొలం పని చేయడానికి కులీలు ఎవరూ రాలేదు.అక్కడే ఆగి కూలీలు వచ్చిన తరువాత వాళ్ళను కోప్పాడ్డాడు. ఇలా వెళ్ళిన చోటల్లా తనకి కొంత నష్టం ఆగిపొయింది.

రామయ్య అలా ప్రతిరోజు హంసను వెతుక్కుంటూ వెళ్ళేవాడు.పొలాల్లో తిరిగేవాడు.అతన్ని చుసి కూలీలు అందరు శ్రద్దగా పని చెయ్యడం మొదలుపెట్టారు.ఇంట్లో చిల్లరదొంగతనాలు ఆగిపొయ్యాయి.పంట ఇంతకు ముందు కంటే ఎక్కువగా రాసాగింది.గేదలు,ఆవుల పాలు ఎక్కువగా రాసాగాయి. ఓ రోజు హరిషుంద్రుడు రామయ్యని చుడాలని వహ్చ్చాడు.రామయ్య తన మిత్రునితో ఇలా అన్నాడు – “నాకు ఇంతవరకు హంస కనపడలేదు.కాని, దాన్ని వెతకడంలో నాకు ఎంతో మేలు జరిగింది.'” హర్షంద్రుడు నవ్వి ఇలా అన్నాడు – “హంస అంటే ఎమి అనుకొన్నావు? కష్టపడతమే తప్ప ఇంకోటి కాదు. రెక్కల కష్టం ఊరికే పోదు. మన పని మనం చేసుకోకుండా ఇతరులకు వదిలి పెడితే నష్టపోతాము.” మన కష్టానికి కచ్చితంగా ఫలితం ఉంటుంది.

పక్షినేర్పిన పాఠం

03/02/2010

ఒక ఊరికి దగ్గరలో సారసపక్షుల జంట నివసిస్తూ ఉండేది.ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది.కొంత కాలానికి గుడ్లలోనుంచి పిల్లలు బయటకి వచ్చాయి.వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరాటానికి ముందే పంటకోతకు వచ్చింది.సారసపక్షులకు దిగులు పట్టుకుంది.రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి వెళ్ళాలి.కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి ఇలా అంది – ‘మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.
ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయంకాలం గూడు చేరుకొంది.అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి – ” ఈ రోజు రెతు వచ్చాడు.పొలం చుట్టూ తిరిగాడు.ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలంవైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది.ఇక కోయాల్సిందే. ఈ రోజే వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో నా చేను కోయమని చెప్తాను.” ‘మీరేమి భయపడకండి.రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మన్మ్ ఇక్కడే హాయిగా ఉండచ్చు.” – అని పక్షి పిల్లలతో చెప్పింది.
కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకుంది.అప్పుడు పిల్లలు బిక్కు బిక్కిమంటూ ఇలా చెప్పాయి – మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్ళాలి. ఈ రోజు రైతు మళ్ళీ  వచ్చాడు. ఊళ్ళోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు.నేను నా అన్నదమ్ములిని పిలిపించి కోయిస్తాను.” సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది – “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు.నాలుగైదు రోజుల్లో మీరు ఇంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటీకి పోనక్కర్లేదు.’
ఇలా మరిన్ని రోజులు గడిచి పొయ్యాయి.సారసపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారసపక్షితో ఇలా అన్నాయి.- “ఈ రైతు మమ్మలిని ఉత్తుత్తినే భయపెడుతున్నాడు.ఇతడు పైరు కోసినట్లే.ఈ రోజు కూడా వచ్చాడు.” “నా అన్నదమ్ములు కూడా నా మాట వినడం లేదు.పైరు బాగా ఎండి పోయి గింజలు నేల రాలుతున్నాయి.రేపు పొద్దుపొడవగానే నేనే వచ్చి మొదలెడతాను.” అని అన్నాడు. అప్పుడు సారసపక్షి భయపడింది. – “అరరే! వెంటనే బయలుదేరండి.ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్ళి తలదాచుకొందాం.రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని అంది.
పిల్లలు ఆదుర్దాగా అడిగారు – “ఎందుకు వెళ్ళాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?” సారసపక్షి ఇలా బదులు చెప్పింది – “రైతు గ్రామస్తులను , సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలగలేదు.తనపని తాను చేయకుండా, ఇతరులను నమ్ముకున్నంత కాలం ఎవరి పనులు జరగవు.కాని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి నిర్ణయించుకొన్నప్పుడు అవి జరిగిపోతాయి. రైతు తానే పంట కోస్తాను అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగిపోతుంది.” ఆ సారసపక్షులు వెంటనే సురక్షిత ప్రాంతానికి ఎగిరిపోయాయి.

దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు

01/02/2010

సోమయ్య తన కొడుకు రాముకి రాత్రి పూట నిద్రపోయేముందు కథలు చెప్పేవాడు.ఓ రోజు తన కొడుకుతో ఇలా అన్నాదు.”బాబూ, ఓ మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోకు.దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు సుమా” ! రాము అటూ ఇటూ తొంగి చూసి “నాన్నా, దేవుడు అన్ని చోట్లా ఉన్నాడా? మరి, నాకెక్కడా కనపడటం లేదే?” అన్నాడు ఆశ్చర్యంగా. “బాబూ, మనం దేవుని చూడలేం.కాని భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు.మనం చేసే అన్ని పనులను గమనిస్తూ ఉంటాదు”. – సోమయ్య కొడుక్కి చెప్పాడు.
రాము తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు.కొద్దిరోజుల తరువాత కరువు వచ్చింది.సోమయ్య పొలాల్లో ఎమీ పండలేదు. ఓ రాత్రి సోమయ్య కొడుకుని వెంటబెట్టుకొని ఊరవతలి పొలానికి వెళ్ళాడు. ఆ పొలం వేరే వాళ్ళది.ఎవరికీ తెలియకుండా ఒక మోపు వరి కంకులుని కోసుకొని పోవాలని సోమయ్య ఆలోచన. పొలం గట్టు మీద రాముని నిలబడమని , నీవు నాలుగు దిక్కులా జాగ్రత్తగా చూస్తుండు. ఎవరైనా కనపడితే నాకు చెప్పు ” అని సోమయ్య కొడుక్కి చెప్పాడు.
సోమయ్య పొలంలో వరికంకులు కోసేందుకని దిగాడో లేదో రాము – “నాన్నా, ఆగండి” అన్నాడు. “ఎవరైనా చుస్తున్నారా ఏం?” – సోమయ్య అడిగాడు. రాము – “ఔను నాన్నా,చూస్తున్నారు”. సోమయ్య పొలంలోనుంచి గట్టుమీదికి వచ్చి చూస్తే అతనికి ఎవరూ కనపడలేదు.అప్పుడు అతని కొడుకుని అడిగాడు – “ఎక్కడ? ఎవరు కనపడటం లేదే?”
రాము – ” దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు. అందరు చేసే పనులు గమనిస్తూ వుంటాడని మీరే చెప్పారుగా! అలాంటప్పుడు మీరు వరికంకులు కోస్తూవుంటే, దేవుడు చూడకుండా వుంటాడా?” సోమయ్య కొడుకు మాటలు విని సిగ్గుతో తల వంచాడు. వెంటనే కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళాడు.

ఆవు – దూడ

28/01/2010

ఒక సారి మేత మేయడానికి ఆవు ఒకటి ఆడవికి వెళ్ళింది.అలా మేస్తూ అది బాగా ఆడవిలోకి వెళ్ళిపోయింది.అక్కడ ఒక పులి ఆవుని చూసింది.ఆవుని తినాలని దాని దగ్గరకి వచ్చింది.ఆవుతో ఇలా అన్నది – “నాకు బాగా ఆకలిగా ఉంది.నేను నిన్ను తినాలని అనుకొంటున్నాను.” అప్పుడు ఆవు – “అయ్యా పులిగారు తప్పకుండా నన్ను తినండి.కాకపోతే నాదొక విన్నపం.నా కోసం నా బిడ్డ ఎదురుచూస్తుంటుంది.దానికి కాసిన్ని పాలు ఇచ్చి మీదగ్గరకి వస్తాను ” అని అంటుంది.

అప్పుడు పులి నేను నిన్ను ఎలా నమ్మేది అని అడుగుతుంది.ఆవు నేను ఖచ్చితంగా వస్తాను.ఒక వేల ఇప్పుడు మీ దగ్గరనుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన ఎప్పటికైన మీకు దొరకకమానను. నామీద నమ్మకం ఉంచి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటుంది. సరేనని పులి అనుమతి ఇస్తుంది.ఆవు ఆనందంతో ఇంటికి వెళ్ళి తన దూడకి పాలు ఇచ్చి దానికి కొన్ని మచి బుద్దులు చెప్పి పులి దగ్గరకి బయలుదేరుతుంది.అలా పులి దగ్గరికి చేరుకొని ఇలా అంటుంది – “నేను వచ్చేశాను .ఇప్పుడు మీరు నన్ను ఆరగించండి.” ఆవు నిజాయితికి ఆశ్చర్యపోయిన పులి తిరిగి – ” నీ నిజాయితికి నేను ముగ్ధుడను అయ్యాను.నీవు వెళ్ళి హాయిగా నీ బిడ్డతో జీవించు నిన్ను వదిలిపెడుతున్నాను.” అని అంటుంది.ఆవు పులికి కృతజ్ఞతలు తెలిపి తన దూడ దగ్గరికి వెళ్ళిపోతుంది.

దయకు దొరికిన ఫలం

27/01/2010

ఉదయవీర్ మొదట్లో చాలా పేదవాడుగా ఉండేవాడు.అతను సాధారణ సిపాయిగా ఉండేవాడు.ఓ రోజు తుపాకి తీసుకొని గుర్రమెక్కి వేటకి వెళ్ళాడు.ఆ రోజు అడవి అంతా గాలించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు.అలా చాలా దూరం వెళ్ళగా ఒక జింక,జింక పిల్ల కనపడ్డాయి.గుర్రాన్ని జింకల వైపు పరిగెత్తించాడు.జింకేమో పరిగెత్త్తి పొదలో దాక్కుంది, పాపం జింక పిల్ల దొరికిపోయింది.దాని నాలుగు కాళ్ళు కట్టివేసి గుర్రం మీద వేసి దాని తల్లి కోసం గాలించసాగాడు.ఎంత వెదికినా అది కనపడక పోవడంతో నిరాశ చెంది తిరిగి పోసాగాడు.
ఉదయవీర్ తనపిల్లను బంధించి తీసుకొని పోతూండటం తల్లి జింక చూసింది.బిడ్డ మీద ప్రేమ కొద్ది,అది పొద నుంచి బయటకి వచ్చింది.ఉదయవీర్ గుర్రం వెంట పరిగెత్త సాగింది.కొంచెం దురం వెళ్ళాక ఉదయవీర్ వెనక్కి తిరిగి చూశాడు.తన వెంబడే జింక రావడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది.అతని హృదయం కరిగి పోయింది. జింక పిల్లను వదిలి పెట్టాడు.జింక సంతోషంతొ పిల్లతో సహా ఎగెరుకుంటూ అడవిలోకి పారిపోయింది.
కొంతకాలానికి అతను చక్రవర్తి అయ్యాడు.కాబట్టీ మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు.అది ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫలితాన్ని ఇస్తుంది.అదే ఉదయవీర్ విషయంలో నిజమైంది.

కలిసి వుంటే కలదు సుఖం

26/01/2010

ఓ అడవిలో ఓ సింహం, ఓ చిరుత పులి ఉండేవి.సింహమేమో బలమైనది.కాని వయస్సు మళ్ళిన కారణంగా సరిగ్గా పరిగెత్త లేకపొయేది,వేటాడలేకపొయేది.చిరుత పులి బాగా బలంగా ఉన్నా, సింహమంటే భయపడేది,దానితో స్నేహం చేసేది.ఎందుకంటే అది మృగరాజు కాబట్టి.అది కాక ఆ సింహం ముసలిదైనా బాగా బలిష్ఠంగానే ఉండేది.
ఒకసారి ఎన్ని రోజులు గడిచినా రెంటికి ఆహారం దొరకలేదు.రెండూ ఆకలితో నకనక లాడుతున్నాయి.దగ్గరలో ఆకులు,అలమలు మేస్తున్న జింక పిల్లను చూశాయి.”నేను జింకపిల్లను వొడిసి పట్టేస్తాను.మీరు దూరంగా ఉండి అది పారిపోకుండా చూడండి.” అని చిరుత సింహంతో చెప్పింది.సరేనని సింహం దూరంగా వుండి పోయింది.చిరుతపులి పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకొని జింక పిల్లను కొరికి చంపేసింది.ఆ జింకపిల్ల మరీ చిన్నదిగా ఉండటంతో అది ఒకరికే సరిపోయేలాగ ఉంది.కాని అవి రెండు బాగా ఆకలిగా ఉన్నాయి.రెంటి నోళ్ళు ఊరుతున్నాయి.”జింక పిల్లను నేనే చంపాను కాబట్టి దీన్ని నేనే తింటాను.” అంది చిరుత.
“నేను మృగరాజుని తెలుసా! కనుక నేనే జింకపిల్లను తింటాను.ఎలాగూ నీవు బాగా పరిగెత్తగలవు.కనుక ఇంకో జంతువును వేటాడి తిను.” అని  గర్జించి చెప్పింది సింహం.ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.రెండు ఒకదాని మీద ఒకటి పంజా విసురుకొవడం మొదలుపెట్టయి.ఆ ప్రక్కనే పొదల చాటున ఒక నక్క దాక్కొని ఇదంతా చూస్తూ ఉంది.సింహం,చిరుత బాగా పోట్లాడుకొని అలసి పడిపోయాయి.అదే అదనుగా భావించి ఆ జింకపిల్లను నక్క వచ్చి లటుక్కున ఎత్తుకొని పోయింది.కాబట్టీ ఆలొచించకుండా అనవసరంగా పోట్లాడుకుంటే అది మనకు కాకుండా ఇంకరికి పోతుంది.అదే అవి రెండు సమానంగా పంచుకొని ఉంటే వాటికి కనీసం కొంతయినా ఆకలి తీరి ఉండేది.

కుందేళ్ళు – కప్పలు

25/01/2010

అవి మండుటెండలు గల రోజులు.పొలాల్లో ఎలాంటి పంటలు లేని కారణంగా కుందేళ్ళు ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి.మైదానాలలో పొదలు ఎండిపొయాయి.కుక్కలు విచ్చలవిరివిగా తిరగడం వలన పాపం వాటికి బయటకి రావాలంటే భయమేయసాగింది.దానితో దిక్కు తోచక అన్నీ కలిసి సమావేశమయ్యాయి.

ఓ కుందేలు ఇలా అంది – “బ్రహ్మదేవుడు మనజాతికి చాలా అన్యాయం చేశాడు.మనల్ని చిన్నవిగా,చేతగాని ప్రాణుల్లా సృష్టించాడు.దుప్పుల్లాగా కొమ్ములు ఇవ్వలేదు,పిల్లులకి మాదిరిగా పెద్దగోళ్ళు ఇవ్వలేదు.శత్రువుల నుంచి ప్రాణాలు రక్షించుకోలేము.ఎవరైనా మన మీద దాడి చేస్తే పారిపోవటం తప్ప ఇంకో మార్గం లేదు.” ఇంకో కుందేలు “ఈ కష్టాలు ,భయాలు నాకొద్దు బాబు! నేను ఏ చెరువులోనో పడి చచ్చిపోవాలనుకొన్నానూ అని అంది.మరొ కుందేలు ఇలా చెప్పింది – ‘నేను కుడా చచ్చిపోవాలనుకొన్నాను.నేను ఇంకెంత మాత్రమూ ఈ కష్టాలు పడలేను.నేనిప్పుడేవెళ్ళి చెరువులో దూకి చస్తాను.” “మేము కూడా నీవెంటే వస్తాం.మనమంతా కలిసే బతికాం, కలిసే చద్దాం.” – అని అన్నీ ఒక్కసారిగా అరిచాయి.అలా చావడనికి చెరువు వైపు బయలుదేరసాగాయి.

కుప్పలు తిప్పలుగా కప్పలు చెరువు గట్టు మీద కూర్చున్నాయి.కుందేళ్ళ అలికిడి వినగానే అవి భయపడి చెంగుచెంగున చెరువులోకి దూకాయి.కప్పలు భయపడి నీళ్ళలోకి దూకడం చూసి కుందేళ్ళు ఆగిపొయ్యాయి.అప్పుడు ఓ కుందేలు తోటి మిత్రులతో ఇలా అంది – “సోదరులారా! మనం చావలిసిన పని లేదు.రండి తిరిగి వెళ్దాం.దేవుని సృష్టిలో మనకంటే చిన్నవి,భయపడే ప్రాణులూ ఉన్నాయి.అవి బతుకుతున్నప్పుడు, మనమెందుకు చావాలి?’

ఆ మాటలు విన్న మిగతా కుందేళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా తిరిగి వెళ్ళాయి.కాబట్టి కష్టాలు అనేవి అందరికి ఉంటాయి.మనకంటె హీనంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు.మనమే వాళ్ళకంటే ఎంతో సుఖంగా ఉన్నాం అనుకొంటే ఎవరికీ ఎటువంటి కష్టాలు ఉండవు.

వెళ్ళండి – రండి

22/01/2010

ఓ ఊళ్ళో శంకరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు.అతనికి చాలా పొలాలు ఉండేవి.ఆ పొలాల్లో చాలా మంది కూలీలు , జీతగాళ్ళు పనిచేశేవారు, శంకరయ్య చాలా సోమరి.ఎప్పుడూ పొలాల వైపు వెళ్ళకుండా పని వాళ్ళ మీద వదిలేసేవాడు.పనివాళ్ళు సరిగా చేయకుండా కాలం గడిపే వారు.పొలాలని సరిగా దున్నకుండా, వాటికి నీళ్ళు పెట్టకుండా,ఎరువులు వేయకుండా వదిలేసేవారు.దాని వలన పంట దిగుబడి ఎటికేటికి దిగుబడి తగ్గసాగింది.తొందరగా బీదవాడు అయ్యాడు.
అదే ఊరిలో రామయ్య అనే మరో రైతు ఉండేవాడు.అతనికి ఎమీ పొలం ఉండేది కాదు.కౌలుకు భూమి తీసుకొని సాగు చేసుకొనేవాడు.బాగా కష్టపడి పని చేసేవాడు.అంతేకాముండా ఇంటిల్లిపాది తనతో పని చేసేవారు.పంటలు బాగా పండాయి.అన్నీ కర్చులు పోను బాగా డబ్బులు మిగిలాయి.కొంతకాలానికి బాగా డబ్బు వచ్చింది.
శంకరయ్య బాగా అప్పుల్లో కూరుకు పోయి పొలాలు అమ్మే స్థితికి వచ్చాడు.ఇది తెలిసిన్ రామయ్య శంకరయ్య దగ్గరకి వచ్చి అతనితో ఇలా అన్నాడు.-“మిరూ పొలాలు అమ్ముతున్నారని తెలిసింది.దయచేసి నాకు అమ్మండి.మీగతా వాళ్ళ్కంటే ఎక్కువ ధర చెల్లిస్తాను”.శంకరయ్య నోరు వెళ్ళబెట్టాడు – “రామయ్యా!ఇన్ని భూములుండే నేను అప్పుల్లో కూరుకుపొయాను.సొంత భూములు లేని నీకు డబ్బెక్కడినుంచి వచ్చింది?నీవు నా భూములునే తీసుకున్నావు కదా కౌలుకి?
అప్పుడు రామయ్య ఇలా బదులు చెప్పాడు – “నాకెవరూ డబ్బు ఇవ్వలేదు.నేను కష్టపడి సంపాదించినదే,కూడబెట్టినదే.మేసేద్యానికి,నాసేద్యానికి తేడా ఉంది. మిరు నౌకర్లని పనిచేయడానికి ‘వెళ్ళండి – వెళ్ళండి ‘ అంటారి.అందువల్ల మీ సంపద అంత హరించుకు పొయింది.నేను పని వాళ్ళకంటే ముందు సిద్దమై వాళ్ళని నాతో పాటు పని చేయటానికి ‘ రండి – రండి ‘ అని పిలుస్తాను.అందువల్ల నా ఇంట్లో సిరిసంపదలు నిండాయి.
దానితో శంకరయ్యకి తన తప్పు ఏమిటో తెలిసింది.అతను రామయ్యకు తన భూములు కొన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు.అప్పటి నుంచి ఒళ్ళు వొంచి పని చేసాడు.తరువాత తన స్థితి మెరుగుపడింది.